Tuesday, October 25, 2011

15 లక్షల వరకు గృహరుణాలపై ఒక శాతం వడ్డీ సబ్సిడీ

న్యూఢిల్లీ,అక్టోబర్ 25:   మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం   మరింత రాయితీ కల్పించనుంది.  ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు తీసుకున్న గృహరుణాలపై మాత్రమే ఒక శాతం వడ్డీ సబ్సిడీ కల్పిస్తున్న ప్రభుత్వం, ఇకపై రూ. 15 లక్షల వరకు తీసుకునే గృహరుణాలకు కూడా వడ్డీ సబ్సిడీని వర్తింపజేయనుంది.  అలాగే వడ్డీ రాయితీ పొందేందుకు అర్హమైన గృహనిర్మాణ వ్యయాన్ని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...