Monday, July 25, 2011

ఇంగ్లండ్ దే గెలుపు

లండన్,జులై 25:   భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరిగిన తొలి టెస్టు లో ఇంగ్లండ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని రుజువు చేసుకుంది. 458 పరుగుల విజయలక్ష్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 261 పరుగులకే చేతులెత్తేసింది.   లక్ష్మణ్ (56), సురేష్ రైనా (78) పరుగులు మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్‌ను బెంబేలెత్తించింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో  సచిన్ సెంచరీ కోసం చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 10 ఓవర్లుకు పైగా క్రీజ్‌లో ఉన్న సచిన్ 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించగా, బ్రాడ్ మూడు, ట్రెమ్లెట్‌ ఒక వికెట్టు  తీసుకున్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...