Sunday, July 24, 2011

నిరాశ మిగిల్చిన సచిన్...టెస్టు పరుగులలో సెకండ్ ప్లేస్ కు ద్రవిడ్

లండన్ , జులై 24: ఇంగ్లాండులోని లార్డ్స్ మైదానంలో తన వందో సెంచరీని  ఘనంగా చేస్తాడని ఆశపడిన అభిమానులకు సచిన్ టెండూల్కర్ నిరాశనే మిగిల్చాడు.  34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్ట్ బ్రాడ్ బౌలింగులో అవుటయ్యాడు. సచిన్ టెండూల్కర్ 58 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 1990లో తొలిసారి లార్డ్స్ మైదానంలో ఆడాడు. రెండో ఇన్నింగ్సు ఉంటే సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశం భారత్‌కు వస్తుందా అనేది అనుమానమే. ఫాలో ఆన్ ఆడితే చెప్పలేం. కాగ నిన్న మూడవ  రోజు ఆటలో   భారత్ తొలి  ఇన్నింగ్స్ లో  286 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ద్రవిడ్ 103 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 5 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ పై 188 పరుగుల  తొలి  ఇన్నింగ్స్ ఆధిక్యం లో ఉంది.
ద్రవిడ్ కోరిక తీరింది
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో ద్రవిడ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. లార్డ్స్ టెస్టులో అజేయ సెంచరీ చేసిన ద్రవిడ్ ప్రస్తుతం 12,417 పరుగులతో సచిన్ (14,726) తర్వాతి స్థానంలో నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ 15 సంవత్సరాల క్రితం అరంగేట్రం చేసిన మైదానం లార్డ్స్. గంగూలీ, ద్రవిడ్ ఒకేసారి 1996 జూన్ 20న ప్రారంభమైన మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లోకి వచ్చారు. నాడు గంగూలీ సెంచరీ చేస్తే... ద్రవిడ్ మాత్రం 95 పరుగుల దగ్గర అవుటై నిరాశపడ్డాడు. చివరికి  లార్డ్స్ లో సెంచరీ చేయాలనే కోరిక ఇప్పుడు తీరింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...