ఆగస్టు 16 నుంచి అన్నాహజారే నిరాహారదీక్ష

న్యూఢిల్లీ,జులై 28: అవినీతి పై మరోసారి పోరాటానికి సామాజిక కార్యకర్త అన్నా హజారే సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను నిరసిస్తూ ఆయన ఆందోళన చేపట్టనున్నారు. ఆగస్టు 16 నుంచి  నిరాహారదీక్షకు దిగుతామని హజారే తెలిపారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన లోక్‌పాల్ బిల్లు ముసాయిదా ప్రజలు కోరుకున్నవిధంగా లేదని పౌరసమాజం ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ముసాయిదా జాతి ప్రజలను అవమానించేదిగా ఉందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. అరవింద్ క్రేజీవాల్, కిరణ్‌బేడీలతో కలిసి  ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని, మంత్రులను పక్కనపెట్టిన లోక్‌పాల్ బిల్లు కోరలు లేని పాము వంటిదని అన్నారు. కేబినెట్ ఆమోదించిన లోక్‌పాల్ ముసాయిదాతో 2జీ, ఆదర్శ్ కుంభకోణాలను విచారించడం సాధ్యం కాదని అరవింద్ క్రేజీవాల్ అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగే సభ్యులను ప్రశ్నించడం అసాధ్యమని అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు