Thursday, July 28, 2011

లోక్‌పాల్ బిల్లు ముసాయిదా ఆమోదం

న్యూఢిల్లీ,జులై 28:  లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా లోక్‌పాల్ పరిధి నుంచి  ప్రధానమంత్రి,న్యాయవ్యవస్థకు మినహాయింపు ఇవ్వటం జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారు.
లోక్‌పాల్ ఇలా...
పదవీ కాలం: ఐదేళ్లు,
కూర్పు: చైర్‌పర్సన్, 8 మంది సభ్యులు
సభ్యులు: నలుగురు ప్రస్తుత, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. మిగతా సభ్యులుగా అవినీతి, విజిలెన్సు కేసులపై దర్యాప్తు చేసిన 25 ఏళ్ల పాలనానుభవం, మచ్చలేని వ్యక్తిత్వం, రికార్డున్న వారు.
ఎంపిక చేసేది: ప్రధాని నేతృత్వంలోని 9 మంది సభ్యుల ప్యానల్. అందులో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభలో విపక్ష నేతలు, ఒక మంత్రి, ప్రఖ్యాత న్యాయ కోవిదులుంటారు.
చైర్‌పర్సన్‌ : భారత ప్రధాన న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ సీజేఐ
చైర్‌పర్సన్ తొలగింపు: సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు రాష్ట్రపతి
విచారణాధికారం: విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టుకు సిఫార్సు మాత్రమే చేస్తుంది.
 దర్యాప్తు : మాజీ ప్రధానులు, మంత్రులు, ఎంపీలు, గ్రూప్ ఏ, అంతకంటే ఉన్నత స్థాయి అధికారులు (పార్లమెంటు ద్వారా ఏర్పాటైన బోర్డులు, అథారిటీలు, కార్పొరేషన్లు, ట్రస్టులు, సొసైటీలు, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల అధికారులతో సహా). మాజీ ప్రధానిపై గరిష్టంగా ఏడేళ్ల లోపు మాత్రమే ఫిర్యాదు చేయవచ్చు. ఇతరులకూ ఇదే వర్తిస్తుంది. విచారణకు సిఫార్సు చేసిన కేసుల్లో దర్యాప్తుకు సీఆర్‌పీసీ సెక్షన్ 197, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19ల కింద అనుమతులు తీసుకోవాల్సిన అవసరం సంస్థకుండదు.
అధికారాలు: ఆరోపణలపై దర్యాప్తు, ప్రభుత్వాధికారులు అవినీతి మార్గాల్లో సంపాదించిన ఆస్తుల జప్తు. ఇందుకోసం సొంత విచారణ, దర్యాప్తు విభాగంతో పాటు అవసరమైన అధికారులు, సిబ్బంది ఉంటారు.
నిధులు:  భారత సంచిత నిధి నుంచి (సుప్రీంకోర్టు మాదిరిగా) విడుదల చేస్తారు.
లోక్‌పాల్ పరిధిలోకి రానివి: ప్రధాని, న్యాయ వ్యవస్థ, పార్లమెంటులో ఎంపీల ప్రవర్తన.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...