Tuesday, April 19, 2011

లోక్‌పాల్ బిల్లు కమిటీపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ,ఏప్రిల్ 19: లోక్‌పాల్ ముసాయిదా కమిటీలో ఐదుగురు పౌర సమాజ నేతలకు స్థానం కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, మరికొందరు అడ్వొకేట్లు దీన్నిదాఖలు చేశారు. పార్లమెంట్ సభ్యులతో మాత్రమే పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కానీ ఈ కమిటీలో ఐదుగురు మంత్రులతోపాటు మరో ఐదుగురు పౌర సమాజ నేతలకు స్థానం కల్పించారని, ఇది రాజ్యంగ విరు ద్ధ మని స్పష్టంచేశారు. అలాగే తండ్రీకొడుకులైన శాంతిభూషణ్, ప్రశాంత్‌భూషణ్‌లకు కమిటీలో చోటు కల్పించడంపైనా అభ్యంతరం తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...