Tuesday, April 19, 2011

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు ప్రశాంతం

కోల్‌కతా,ఏప్రిల్ 19: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఆరు ఉత్తరాది జిల్లాలు.. డార్జిలింగ్, జల్‌పాయిగురి, కూచ్‌బెహార్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, మాల్దాల్లోని 54 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో భారీస్థాయిలో 74.27 శాతంమంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాల్లో పోలింగ్ 82.91 శాతంగా నమోదు కావడం విశేషం. 11 మంది మంత్రులు సహా అనేకమంది ప్రముఖులు మొదటి విడత బరిలోఉన్నారు. 38 మంది మహిళలు సహా 364 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చడానికి సోమవారం ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. విద్యుత్ కోత కారణంగా కొన్నిచోట్ల కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్ నిర్వహించారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. వాటిని బాగుచేసి, పోలింగ్‌ను కొనసాగించారు. సున్నితమైనవిగా పేర్కొన్న 1800 పోలింగ్ కేంద్రాలు సహా మొత్తం 12,131 పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పారామిలటరీని మోహరించారు.  మొత్తం మీద ‘పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...