Friday, March 11, 2011

మధుర మీనాక్షి ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు

మధురై,మార్చి 12: తమిళనాడులోని విఖ్యాత మధుర మీనాక్షి ఆలయానికి ఐఎస్‌ఓ 9001:2008 విశిష్ట గుర్తింపు ధ్రువపత్రం లభించింది. భక్తులకు అత్యుత్తమ సేవలందిం చడం, భద్రతా ప్రమాణాల్ని నిక్కచ్చిగా పాటించడం, నిత్యం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల  తమకు ఈ గుర్తింపు లభించిందని ఆలయ ఈవో పద్మనాభన్ తెలిపారు. ఐఎస్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ స్థాయిలో సేవల్ని అందించేందుకు భవిష్యత్తులో ఆలయ మండలి విశేషకృషి చేస్తుందన్నారు. మీనాక్షి ఆలయంతోపాటు చెన్నైలోని పార్థసారథి ఆలయం, శ్రీకపిలేశ్వర ఆలయాలకు కూడా ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...