మధుర మీనాక్షి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు
మధురై,మార్చి 12: తమిళనాడులోని విఖ్యాత మధుర మీనాక్షి ఆలయానికి ఐఎస్ఓ 9001:2008 విశిష్ట గుర్తింపు ధ్రువపత్రం లభించింది. భక్తులకు అత్యుత్తమ సేవలందిం చడం, భద్రతా ప్రమాణాల్ని నిక్కచ్చిగా పాటించడం, నిత్యం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల తమకు ఈ గుర్తింపు లభించిందని ఆలయ ఈవో పద్మనాభన్ తెలిపారు. ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ స్థాయిలో సేవల్ని అందించేందుకు భవిష్యత్తులో ఆలయ మండలి విశేషకృషి చేస్తుందన్నారు. మీనాక్షి ఆలయంతోపాటు చెన్నైలోని పార్థసారథి ఆలయం, శ్రీకపిలేశ్వర ఆలయాలకు కూడా ఐఎస్ఓ గుర్తింపు లభించింది.

Comments