మధుర మీనాక్షి ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు

మధురై,మార్చి 12: తమిళనాడులోని విఖ్యాత మధుర మీనాక్షి ఆలయానికి ఐఎస్‌ఓ 9001:2008 విశిష్ట గుర్తింపు ధ్రువపత్రం లభించింది. భక్తులకు అత్యుత్తమ సేవలందిం చడం, భద్రతా ప్రమాణాల్ని నిక్కచ్చిగా పాటించడం, నిత్యం ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల  తమకు ఈ గుర్తింపు లభించిందని ఆలయ ఈవో పద్మనాభన్ తెలిపారు. ఐఎస్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ స్థాయిలో సేవల్ని అందించేందుకు భవిష్యత్తులో ఆలయ మండలి విశేషకృషి చేస్తుందన్నారు. మీనాక్షి ఆలయంతోపాటు చెన్నైలోని పార్థసారథి ఆలయం, శ్రీకపిలేశ్వర ఆలయాలకు కూడా ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు