హైదరాబాద్,మార్చి 12: మిలియన్ మార్చ్ సందర్భంగా ఆందోళనకారులు ట్యాంక్బండ్పై కూల్చివేసిన విగ్రహాలను పునఃప్రతిష్ఠిస్తామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులు ఎంతటివారైనా శిక్షిస్తామని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేస్తామని కొన్ని నెలలుగా ప్రకటనలు చేసిన వారందరిపైనా కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యమూ ఉందని అంగీకరించారు. ‘‘హైదరాబాద్ను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. మిలియన్ మార్చ్కు అనుమతి ఇవ్వాలని టీఆర్ఎస్తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలూ నన్ను కోరారు. ఏదైనా గొడవ చేస్తారనే సమాచారం సర్కారుకు ఉంది. అందుకే అనుమతి ఇవ్వలేదు. ఇది సున్నిత సమస్య. అందుకే రబ్బరు బుల్లెట్లతో కూడా కాల్చవద్దని పోలీసులను ఆదేశించాం. కొంచెం పొరపాటు జరిగిన మాట వాస్తవమే. నేను ఒప్పుకుంటున్నాను. ’’ అని వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment