మార్చి 10న హైదరాబాద్ దిగ్బంధం: కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి 26: మార్చి 10న 10 లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధిస్తామని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ జిల్లాల ప్రజలందరినీ హైదరాబాద్ తరలించి, చీమ కూడా కదలకుండా దిగ్బంధిస్తామని, రాజధాని రోడ్లపైనే వంటావార్పు చేస్తాంమని హెచ్చరించారు. ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో నిరసన దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు కేసీఆర్ సంఘీభావం ప్రకటించారు. ‘ప్రధాని కుర్చీల కూసున్న మన్మోహన్ ఒక పాణం లేని బొమ్మ అని . కేంద్రం దిగి రావాలంటె మార్చి 10న హైదరాబాద్లోకి చీమను కూడా అడుగు పెట్టనీయొద్దు. నగరమంతా ఎక్కడికక్కడ స్తంభించిపోవాలె’’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు. ‘‘డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను పోగొట్టింది, అప్పటిదాకా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులే. రాజీనామా చేస్తే బంపర్ మెజారిటీతో గెలిపిస్తనని చెప్పిన. అయినా పదవులుపోతే సచ్చిపోతామంటున్నరు. ఇలాంటి సవటలను, దద్దమ్మలను నమ్ముకుంటే తెలంగాణ రాదు. 4 లక్షల మంది ఉద్యోగులు చేపట్టిన సహాయ నిరాకరణను చూసైనా సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు మీ బతుకులు గౌరవంగా ఉన్నయా? బండ కట్టుకుని బావిలో దూకండి. మీరు రాజీనామా చేసుంటే ఈ గోస ఉండేదా?’’ అంటూ గంగవెర్రులెత్తారు.
Comments