కొలంబో,ఫిబ్రవరి 26: వరల్డ్ కప్ గ్రూప్ ఏలో రెండు మాజీ ప్రపంచ చాంపియన్లయిన శ్రీలంక- పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం స్థానిక ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 11 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. సూపర్ ఫామ్లో ఉన్న మిస్బా ఉల్ హక్ (91 బంతుల్లో 83 నాటౌట్; ఫోర్లు 6), సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్ (76 బంతుల్లో 72; ఫోర్లు 4) అర్ధ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. దీనికి ప్రతిగా ఆతిథ్య లంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. సంగక్కర (61 బంతుల్లో 49; ఫోర్లు 2, సిక్స్ 1), చమర సిల్వ (78 బంతుల్లో 57; ఫోర్లు 5) ఇద్దరే రాణించారు. 34 పరుగులకు నాలుగు వికెట్లు తీసిన ఆఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment