Saturday, November 13, 2010

అమెరికా రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ యువతి మృతి

వాషింగ్టన్,నవంబర్ 13 : అమెరికా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్  యువతి  మృతి చెందింది. కెంటకీ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్న అర్పణ తన సోదరి అర్చనతో కలిసి శనివారం కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అర్చన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ సికింద్రాబాద్‌కు చెందిన  ఒక వ్యాపారి కవల కుమార్తెలు.అక్కచెల్లెళ్లు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బీ.ఫార్మసీ  చదివిన వీరు ఎంఎస్‌ చేసేందుకు రెండేళ్ళ క్రితం నాష్వెల్ టెన్నిస్ కు వచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...