Wednesday, November 10, 2010

ఆంధ్ర ఎం.పీ. విందుకు హాజరు పై దుగ్గల్ వివరణ

న్యూఢిల్లీ,నవంబర్ 10 : ఆంధ్ర ఎంపీ ఆతిధ్యాన్ని స్వీకరించడం తన వ్యక్తిగతమని శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు వీకే దుగ్గల్ స్పష్టం చేశారు. తాము రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆతిధ్యాన్ని స్వీకరించడంతో తెలంగాణవాదుల నుండి వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఆయన వివరణ ఇచ్చారు. తనకు సుబ్బిరామిరెడ్డి స్నేహితుడు, శ్రేయోభిలాషి అని, గత 15 సంవత్సరాల నుంచి తమ మధ్య మంచి సంబంధాలున్నాయని ఆయన తెలిపారు. ఆతిధ్యాన్ని స్వీకరించడం వల్ల నిర్ణయాల్లో ఎటువంటి తేడాలు రావన్నారు. కామన్‌వెల్త్ క్రీడల డిన్నర్ సందర్భంగా తెలంగాణవాదుల నివాసానికెళ్లి గంటకు పైగా గడిపానని, అంతమాత్రనా తెలంగాణవాదులకు అనుకూలమా అని దుగ్గల్ ప్రశ్నించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...