Friday, November 5, 2010

పోలీసుల అదుపులో పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు

హైదరాబాద్,నవంబర్ 6: దివంగత టి.డి.పి. నేత పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు ఆర్.ఓ.సి. వ్యవస్థాపకుడు పోతుల సురేష్ గుజరాత్ లోని సూరత్ జిల్లలో కిద్నాప్ కు గురైనట్టు అతని భార్య సునీత   మీడియా కు తెలిపింది. పరిటాల రవీంద్ర  హత్యానంతరం అజ్ఞాతంలో వుంటున్నాడు. తన భర్తను పోలీసులే కిడ్నాప్ చేశారని, అతనిని కోర్ట్ లో హాజరు పరచాలని సునీత డిమాండ్ చేస్తోంది.   అనంతపురం ఫ్యాక్షన్ కు  సంబందించి  పలు హత్యలలో పోతుల సురేష్ నిందితుడుగా వున్నాడు. కాగ్ ఆ, సురేష్ ను తామే అదుపులోకి తీసుకున్నామని అనంతపురం జిల్లా స్పెషల్  పార్టీ పోలీసులు తెలిపారు. సురేష్ ను  అనంతపురం కోర్ట్ లో ప్రవేశపెడతామని వారు చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...