Wednesday, November 10, 2010
మళ్ళీ చంచల్గూడ జైల్కు రామలింగరాజు
హైదరాబాద్ ,నవంబర్ 10: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు బుధవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. ఆయనతో పాటు మరో అయిదుగురు నిందితులు కూడా కోర్టులో లొంగిపోయారు. వీరి బెయిల్ ను సుప్రిం కోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎటువంటి బెయిల్కు దరఖాస్తు చేసుకోకుండా జూలై 2011 వరకు రామలింగరాజు జుడీషియల్ కస్టడీలో వుంటారని సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ తెలిపారు. రాజుతో పాటు ఈ కేసులో లొంగిపోయిన మరో ఐదుగురిని చంచల్గూడ సెంట్రల్ జైల్కు తరలించారు. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని సుప్రీంలో చేసిన దరఖాస్తు తిరస్కరించడంతో రామలింగరాజు ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
No comments:
Post a Comment