Monday, November 8, 2010

డ్రా గా ముగిసిన అహ్మదాబాద్ టెస్ట్

అహ్మదాబాద్,నవంబర్ 8: భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. 294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ పరుగులేమి చేయకుండానే మెకింతోష్ వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ 22 పరుగులు చేసింది. 22/1 స్కోరు వద్ద మ్యాచ్ డ్రా అయినట్టు ప్రకటించారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 266 పరుగులకు ఆలౌటయింది. లక్ష్మణ్ (91), హర్భజన్ సింగ్ (115) అద్భుతంగా ఆడడంతో టీమిండియాకు గౌరవప్రద స్కోరు లబించింది,.   భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 459 పరుగులు సాధించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...