Wednesday, November 3, 2010
కివీస్ తో తొలి టెస్ట్ కు ధోనీ సేన సిద్ధం: సచిన్ 50వ సంచరీపై అభిమానుల ఆశలు
అహ్మదాబాద్,నవంబర్ 3: న్యూజిలాండ్తో జరిగే మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం మొతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆరంభమవుతుంది. స్టార్ ఆటగాళ్లతో భారత్ ,యువ ఆటగాళ్లపై ఆశలతో న్యూజిలాండ్ బరిలో దిగితున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఈ స్టేడియంలో రెండు టెస్టులు జరిగాయి. అయితే ఆ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. మూడో ప్రయత్నంలోనైనా కివీస్పై విజయం సాధించి అహ్మదాబాద్లో బోణీ కొట్టాలని ధోని సేన పట్టుదలతో ఉంది. టెస్టుల్లో నెంబర్వన్గా ఉన్న భారత్ 2008 నుంచి స్వదేశంలో ఒకే టెస్టులో ఓడిపోయింది. సొంతగడ్డపై ఆడిన గత ఆరు టెస్టుల్లో భారత్ ఐదింటిలో గెలిచింది. కాగా, న్యూజిలాండ్తో గురువారం మొదలయ్యే తొలి టెస్టులో మాత్రం అందరి దృష్టి సచిన్పైనే. కారణం... మరో సెంచరీ సాధిస్తే సచిన్ టెస్టుల్లో 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా అరుదైన ఘనత సాధిస్తాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment