Monday, November 22, 2010
తొక్కిసలాటలో 190 మంది మృతి
నాంఫెన్,నవంబర్ 22: కాంబోడియా రాజధాని నాంఫెన్లో సోమవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 190 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. రాజధాని లోని ఒక నది మధ్యనున్న ద్వీపంలో జరుగుతున్న జల ఉత్సవంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వర్షాకాలం ముగింపు సందర్భంగా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. వీటికి దాదాపు 20 లక్షల మంది హాజరవుతుంటారని అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి పడవ పందాలు ముగిసిన తర్వాత సంగీత కార్యక్రమాలు జరిగే కోపిచ్-డైమండ్ ఐలాండ్కు వెళ్లడానికి వేలాది ప్రజలు ఒకేసారి బ్రిడ్జిపైకి వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అనేక మంది నదిలో పడిపోయారు. వందలాదిమంది కింద పడిపోయారు. దీంతో కనీసం 190 మంది చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వందలాది మంది తీవ్ర గాయాలతో నేలపై పడి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment