Monday, November 22, 2010

భారత్ కు భద్రతామండలి సభ్యత్వంపై అమెరికా కాంగ్రెస్‌లో తీర్మానం

వాషింగ్టన్,నవంబర్ 22: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి వీలుగా ఐరాస చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ సభ్యుడు గుస్ బిలిరాకిస్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం లో పంచ శాంతికి, దక్షిణాసియా అభివృద్ధికి భారత్ చేసిన కృషిని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ లో ఏ రాజకీయాభిప్రాయాన్నయినా స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చని తీర్మానం పేర్కొంది. తీర్మానంపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడంకోసం విదేశీ వ్యవహారాల హౌస్ కమిటీ పరిశీలనకు పంపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...