భారత్ కు భద్రతామండలి సభ్యత్వంపై అమెరికా కాంగ్రెస్‌లో తీర్మానం

వాషింగ్టన్,నవంబర్ 22: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి వీలుగా ఐరాస చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ సభ్యుడు గుస్ బిలిరాకిస్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం లో పంచ శాంతికి, దక్షిణాసియా అభివృద్ధికి భారత్ చేసిన కృషిని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ లో ఏ రాజకీయాభిప్రాయాన్నయినా స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చని తీర్మానం పేర్కొంది. తీర్మానంపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడంకోసం విదేశీ వ్యవహారాల హౌస్ కమిటీ పరిశీలనకు పంపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు