Sunday, September 26, 2010
కల్లోల కాశ్మీరానికి కాసింత ఊరట
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 26: కల్లోల కాశ్మీరాన్ని కుదుటపడేసేందుకు కేంద్రం ఎనిమిది అంశాలతో 'కాశ్మీర్ ఫార్ములా'ను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని వర్గాల ప్రజానీకంతో చర్చలు జరిపేందుకు మధ్యవర్తుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. కాశ్మీర్లోయలో ప్రత్యేకించి శ్రీనగర్లో భద్రతా దళాల మోహరింపు అంశాన్ని సమీక్షించనున్నట్లు పేర్కొంది. ఫార్ములా లోని అంశాలు: 1. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో చర్చల కోసం ప్రముఖ వ్యక్తి సారథ్యాన మధ్యవర్తుల బృందం.2. అల్లర్ల సందర్భంగా అరెస్టయిన విద్యార్థులు, యువతపై కేసులు ఎత్తివేత, జైళ్ల నుంచి విడుదల.3. ప్రజా భద్రతా చట్ట కేసులపై సమీక్ష, బందీల విడుదల.4. తక్షణమే యునిఫైడ్ కమాండ్ సమావేశం, కాశ్మీర్లోయలో దళాల మోహరింపుపై సమీక్ష.5. అల్లర్లలో చనిపోయినవారి కుటుంబాలకు ఐదేసి లక్షలు.6. జమ్మూ, లడఖ్ ప్రాంతాల అభివృద్ధి అవసరాలను పరిశీలించేందుకు రెండు టాస్క్ఫోర్స్లు.7. తక్షణమే అన్ని విద్యాసంస్థల తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి, ప్రత్యేక తరగతుల నిర్వహణకు సూచన.8. వంద కోట్లతో స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపా యాల అభివృద్ధి. కాశ్మీర్ లోయలో పరిస్థితిని, ఇటీవల 36 మంది సభ్యులతో కూడిన అఖిలపక్ష బృందం సమర్పించిన నివేదికను సమీక్షించిన అనంతరం సీసీఎస్ ఈ నిర్ణయాలు తీసుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment