Sunday, September 12, 2010

గ్రహాంతర సముద్రాలను గుర్తించడానికి టెలిస్కోప్

వాషింగ్టన్,సెప్టెంబర్ 12: ఇకపై ఆయా గ్రహాల్లో సముద్రాలేమైనా ఉన్నాయేమో పరిశోధించేందుకు రంగం సిద్ధమవుతోంది. 2014లో ప్రయోగించేందుకు ఉద్దేశించిన అమెరికా టెలిస్కోపుతో భూమి వంటి గ్రహాల్లో నీటి ఉనికిని గుర్తించాలని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అలా గుర్తిస్తే భూమికి సోదరిని గుర్తించినట్లేనని వారి భావన. దీని కోసం వారు భూమికి సమానమైన పరిమాణంలో ఉండే గ్రహాలను వాటి కేంద్ర నక్షత్రాలకు భూమి ఉన్న దూరంలోనే ఉన్న వాటిని పరిశీలిస్తారు. మొత్తానికి ముమ్మూర్తులా భూమిని పోలి ఉన్న గ్రహాలను కనుగొనడం వారి లక్ష్యంగా ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...