Sunday, September 12, 2010

అర్జున్ ముండా ప్రమాణ స్వీకారానికి అద్వానీ గైర్హాజర్

రాంచీ,సెప్టెంబర్ 12 : ముచ్చటగా మూడోసారి జార్ఖండ్ సీఎంగా బీజేపీ నేత అర్జున్ ముండా ప్రమాణ స్వీకారం చేశారు. మరోసారి బీజేపీ- జేఎంఎం సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశారు. మరో ఇద్దరు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిగా ముండా ప్రమాణ స్వీకారం చేశారు.వారం రోజుల్లో ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తనయుడు, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, ఏజేఎస్‌యూ అధ్యక్షుడు సుదేశ్ మహతో తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనా.. ఊహించినట్లే.. జేఎంఎంతో పొత్తుపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఎల్‌కే అద్వానీతో సహా బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వినాయక చవితి కారణంగానే అద్వానీ ఈ కార్యక్రమానికి రాలేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. జేఎంఎంతో పొత్తుకు సంబంధించి మిగిలిన నేతలతో సంప్రదించకుండా బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌లే నిర్ణయం తీసేసుకున్నారని, తాజా పరిణామాలతో అద్వానీ ఆగ్రహంగా ఉన్నారని, అందుకే గైర్హాజరయ్యారని సమాచారం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...