దారుణ విషాదానికి తొమ్మిదేళ్లు

వాషింగ్టన్‌,సెప్టెంబర్ 12: సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం.. సెప్టెంబర్ 11 న అదో భయానక వాస్తవం! అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ వాణిజ్యానికే తలమానికంగా ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాద పంజా దెబ్బకు నిట్టనిలువునా కుప్పకూలిన సమ యం! సుమారు 3వేల మంది శిధిలాల్లో సమాధై డీఎన్ఏ పరీక్షలతో తప్ప ఆనవాళ్లు తెలుసుకోలేనంత బీభత్స మరణాల ఘాతుకం! 9/11 దాడులు.. న్యూయార్క్‌లోని ట్విన్‌టవర్స్, వాషింగ్టన్‌లో పెంటగాన్, పెన్సిల్వేనియాలోని మరో లక్ష్యంపై విమానాలతో దాడులు చేసిన ఉగ్రవాదులు..3,000మందిని బలిగొన్నారు! ఈ మూడిం టిలో అత్యంత భీతావహ సన్నివేశం డబ్ల్యూటీసీదే! విమానాలు టవర్లను ఢీకొనడంతో ఆ ఆకాశ హర్మ్యం కూలింది. కొద్ది వ్యవధిలోనే నేలమట్టమైంది!

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు