Thursday, September 16, 2010

గాయని స్వర్ణలత ఆకస్మిక మృతి

చెన్నై,సెప్టెంబర్ 16: ప్రఖ్యాత గాయని, జాతీయ అవార్డు గ్రహీత స్వర్ణలత (37) చెన్నైలో మృతిచెందారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ హాస్పటల్‌తో తుదిశ్వాస విడిచారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో 1973లో జన్మించిన ఆమె దక్షిణాది నాలుగు భాషలు - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ సినిమాల్లోనూ పాటలు పాడారు.తమిళ చిత్రం 'కరుత్తమ్మ' (1994)లో పాడిన 'పోరలే పొన్నుత్తాయి' పాటతో ఆమెకి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు లభించింది. దీనికి ఎ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకుడు. అంతకంటే మునుపు 'చిన్నతంబి' (1991)లో పాడిన 'పోవొమ్మ ఊర్కోలమ్' పాటకి తమిళనాడు ఉత్తమ గాయని అవార్డుని ఆమె అందుకున్నారు.అలాగే తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేసే 'కలైమామణి' అవార్డును సైతం ఆమె అందుకున్నారు.స్వర్ణలత తండ్రి కె.సి. చేరుకుట్టి పేరుపొందిన హార్మోనియం వాద్యగాడే గాక చక్కని గాయకుడు కూడా. తొలిగా కె.జె. ఏసుదాస్‌తో తమిళంలో ఓ డ్యూయెట్ పాడటం ద్వారా ఆమె సినీ రంగంలో గాయకురాలిగా అడుగుపెట్టారు. ఆ పాటకు స్వర కల్పన చేసింది విఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్. అనంతర కాలంలో ఆమె ఇళయరాజా,ఎ.ఆర్. రెహమాన్ వంటి గొప్ప సంగీతకారులు కూర్చిన బాణీలకు పాటలు ఆలపించారు. తెలుగులో 'ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ' (నిర్ణయం), (ముక్కాలా ముకాబ్‌లా' (ప్రేమికుడు), 'రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా' (చూడాలని ఉంది), 'చికుబుక్ రైలే' (జంటిల్‌మన్), 'పాటకు ప్రాణం పల్లవి ఐతే' (వాసు) తరితర హిట్ గీతాలు ఆమె పాడారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...