Thursday, September 16, 2010

బెంగళూరు, బీజింగ్‌ విద్యార్థులతో పోటీ పడండి: అమెరికా విద్యార్థులకు ఒబామా పిలుపు

వాషింగ్టన్,సెప్టెంబర్ 16 : భారత్, చైనా విద్యార్థులతో పోటీ పడేందుకు కష్టపడి చదవాలని తన దేశ విద్యార్థులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉద్భోదించారు. భారత్‌లోని బెంగళూరు, చైనాలోని బీజీంగ్ విద్యార్థుల నుంచి కనీవినీ ఎరగని స్థాయిలో పోటీ ఎదురవుతున్నదన్నారు. 21వ శతాబ్దంలో అమెరికా విజయగాధను విద్యార్థులే లిఖించాల్సి ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్సిల్వేనియాలో జరిగిన 'బ్యాక్ టూ స్కూలు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ' మీ బాధ్యతలను మీరు ఏర్పరుచుకున్నారు. మీకు వీలైనంత మంచి విద్యను అందించడం అమెరికా బాధ్యత' అని పేర్కొన్నారు. 'గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర దేశాలు మనతో పోటీ పడుతున్నాయి. భారత్‌లోని బెంగళూరు నగరం, చైనా రాజధాని బీజింగ్‌లకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కష్టపడుతున్నప్పుడు.. మీరు సాధించే విజయం మీ ఒక్కరిదే కాబోదు.. అది 21వ శతాబ్దంలో అమెరికా విజయాలను అది దృఢతరం చేస్తుంది' అని తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...