ఆయుధ సాయంపై పాక్కు ఒబామా చురక
వాషింగ్టన్,సెప్టెంబర్ 28: భారత్ ప్రయోజనాలకు భంగం కల్గించే రీతిలో పాకిస్థాన్కు ఆయుధ సాయం చేసే ప్రసక్తే లేదని అమెరికా పాకిస్థాన్కు స్పష్టం చేసింది. అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టగానే బరాక్ ఒబామా ఈ విషయాన్ని పాక్కు తెలియచేశారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో 2009 మే 7న జరిపిన భేటీలో ఒబామా ఈ అంశాన్ని స్పష్టం చేసిన విషయం ఇటీవలే విడుదలైన ఓ పుస్తకం ద్వారా వెల్లడైంది. తమ ఆయుధ సాయాన్ని దుర్వినియోగపర్చరాదని ఒబాబా నిర్మొహమాటంగా తెలిపారు. పాక్కు అందే సాయంతో భారత్ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడకుండా చూడాల్సి ఉందని ఒబామా ఈ భేటీలో సూచించారు. అమెరికా జర్నలిస్టు బాబ్ ఉడ్వార్డ్ రాసిన తాజా పుస్తకం 'ఒబామాస్ వార్'లో ఇరువురు నేతల భేటీ అంశం చోటుచేసుకుంది. ఇరువురు నేతల భేటీ సమయంలో జర్దారీ కుమారుడు బిలావల్ కూడా ఉన్నారని పుస్తకంలో తెలిపారు.
Comments