Wednesday, February 3, 2010

మంత్రులకు మన్మోహన్ రూల్స్


నూఢిల్లీ,ఫిభ్రవరి 3: కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కఠిన నియమావళి విధించారు. కేంద్ర, రాష్ర్ట మంత్రులు ఆస్తులు, అప్పులు ప్రకటించాలని ప్రధాని ఆదేశించారు. బహుళ జాతి సంస్థల్లో మంత్రుల కుటుంబ సభ్యులు పనిచేస్తుంటే తప్పనిసరిగా అనుమతి పొందాలని చెప్పారు. ప్రభుత్వ లైసెన్సులు అవసరమైన వ్యాపార సంస్థల్లో చేరవద్దని మంత్రులను ఆదేశించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మంత్రులకు వాటాలు ఉంటే వాటి వివరాలను వెల్లడించాలని, కొత్త వ్యాపార సంస్థలను మంత్రులు ఎవరూ ప్రారంభించవద్దని ప్రధాని ఆదేశించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...