తెలంగాణా కమిటీ రెడీ


హైదరాబాద్,ఫిభ్రవరి 3: తెలంగాణపై హోం శాఖ మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనల మేరకు జస్టిస్ వి.ఎన్. శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని యేర్పాటు చేశారు.కమిటీలో కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శి వినోద్ కె. దుగ్గల్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. న్యాయ, ఆర్థిక రంగాల్లో నిపుణులైన రణబీర్ సింగ్, అబూ సలే షరీఫ్, డాక్టర్ రవీందర్ కౌర్ ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజలతోనూ ఈ కమిటీ సంప్రతింపులు జరుపుతుందని, నెల రోజుల్లో తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని హోం శాఖ వెల్లడించింది. కమిటీ సభ్యులతో మాట్లాడి, కమిటీ విధివిధానాలను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది. అయితే, కమిటీ వెలువరించిన ప్రకటనలో ఎక్కడా ‘తెలంగాణ’ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్ లో సంప్రతింపుల కోసమే ఈ కమిటీ’ అంటూ ప్రకటనలో పేర్కొంది. కమిటీ సభ్యుల వివరాలు : 1) జస్టిస్ శ్రీకృష్ణ – కమిటీ చైర్మన్ – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి 2) వినోద్ కె. దుగ్గల్ – కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి 3) రణ్ బీర్ సింగ్ – నేషనల్ లా శ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ 4) డాక్టర్ రవీందర్ కౌర్ – ఢిల్లీ ఐఐటిలో సామాజిక శాస్త్రం అధ్యపకురాలు 5) అబు సలే షరీఫ్ – అంతర్జాతీయ ఆహార విధాన కమిటీ సభ్యుడు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు