Wednesday, February 3, 2010
తెలంగాణా కమిటీ రెడీ
హైదరాబాద్,ఫిభ్రవరి 3: తెలంగాణపై హోం శాఖ మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనల మేరకు జస్టిస్ వి.ఎన్. శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని యేర్పాటు చేశారు.కమిటీలో కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శి వినోద్ కె. దుగ్గల్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. న్యాయ, ఆర్థిక రంగాల్లో నిపుణులైన రణబీర్ సింగ్, అబూ సలే షరీఫ్, డాక్టర్ రవీందర్ కౌర్ ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజలతోనూ ఈ కమిటీ సంప్రతింపులు జరుపుతుందని, నెల రోజుల్లో తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని హోం శాఖ వెల్లడించింది. కమిటీ సభ్యులతో మాట్లాడి, కమిటీ విధివిధానాలను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది. అయితే, కమిటీ వెలువరించిన ప్రకటనలో ఎక్కడా ‘తెలంగాణ’ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘ఆంధ్రప్రదేశ్ లో సంప్రతింపుల కోసమే ఈ కమిటీ’ అంటూ ప్రకటనలో పేర్కొంది. కమిటీ సభ్యుల వివరాలు : 1) జస్టిస్ శ్రీకృష్ణ – కమిటీ చైర్మన్ – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి 2) వినోద్ కె. దుగ్గల్ – కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి 3) రణ్ బీర్ సింగ్ – నేషనల్ లా శ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ 4) డాక్టర్ రవీందర్ కౌర్ – ఢిల్లీ ఐఐటిలో సామాజిక శాస్త్రం అధ్యపకురాలు 5) అబు సలే షరీఫ్ – అంతర్జాతీయ ఆహార విధాన కమిటీ సభ్యుడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment