Thursday, January 21, 2010

‘ఆస్కార్’కు మళ్లీ రెహ్మాన్ పాట


ముంబై,జనవరి 21: ‘స్లమ్ డాగ్ మిలియనీర్ 'చిత్రంలోని ‘జై హూ’ పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి రెండు ఆస్కార్ లు గెలుచుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడుగా ఎ.ఆర్.రెహ్మాన్ గత ఏడాది సంచలనం సృష్టించారు. ఈ ఏడాది సైతం ఆయన మరోసారి ఆస్కార్ నామినేషన్ కు వెళ్లారు. హాలీవుడ్ చిత్రం ‘కపుల్స్ రిట్రీట్’ కోసం ఆయన కంపోజ్ చేసిన ‘నానా’ అనే పాట ఈ ఏడాది జరుగనున్న 82వ అకాడమీ అవార్డుల కోసం అవార్డు కమిటీ నామినేషన్ కు వెళ్లింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన 63 పాటల్లో ఇదొక పాటగా కమిటీ గుర్తించింది. ఈ పాటలో కొంత భాగాన్ని రెహ్మాన్ కుమారుడు పాడటం విశేషం. ఫిబ్రవరి 2న నామినేషన్లను ప్రకటించనున్నారు. ఆంగ్లం, ఆఫ్రికన్, హిందీ, స్పానిష్, సంస్కృతం వంటి ట్రాక్స్ తో కూడిన ఈ ఆల్బమ్ త్వరలోనే ఇండియాలో కూడా విడుదల కానుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...