ఆంధ్రకు రూ. 3720 కోట్ల ప్రపంచబ్యాంక్ రుణం
హైదరాబాద్,జనవరి 22: రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకోసం రూ. 3720 కోట్ల రుణం కోసం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. రహదారుల అభివృద్ధికి రూ. 1568 కోట్లు, గ్రామీణ తాగు నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం రూ. 720 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి 1432 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుంటున్నట్లు సిఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై శుక్రవారం నాడు సంతకాలు జరిగాయి. 2015 నాటికి ఈ మూడు ఒప్పందాల పనులు పూర్తౌతాయి.
Comments