డీ.జీ.పీ. గా గిరీష్ కుమార్ నియామకాన్ని తప్పు పట్టిన క్యాట్
హైదరాబాడ్,జనవరి 28: సీనియారిటీ పక్కనబెట్టి గిరీష్ కుమార్ను డిజీపిగా ఎందుకు నియమించాల్సి వచ్చిందని క్యాట్ ప్రశ్నించింది. మాజీ డీజీపీలు ఎస్ఎస్పీ యాదవ్, మహంతిల తొలగింపు కేసును పరిశీలించిన క్యాట్ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డీజీపిల పదొన్నతిలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని గిరిష్ కుమార్ను సీనియారిటీని పక్కన పెట్టి ఎందుకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో కొత్త డీజీపిని నియమించాలని, గిరీష్ కుమార్ను తాత్కాలికంగా కొనసాగించాలని, డీజీపీ పదవికి అర్హులైన ముగ్గురి జాబితాను తయారు చేయాలని క్యాట్ సూచించింది. అలాగే మాజీ డీజీపీలు ఎస్ఎస్పి యాదవ్, మహంతిలు చేసుకున్న అప్పిల్ను పరిశీలిస్తూ రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కులేదని, ప్రభుత్వం ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం ఉందని, అయితే తగ్గించిన వేతనాలను తిరిగి చెల్లించాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది.
Comments