Thursday, January 28, 2010

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఖరారు

ముంబై,జనవరి 28: దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఖరారైంది. జట్టు సభ్యులను బీసీసీ గురువారం ప్రకటించింది. అభిమన్యు మిథున్‌, వర్థమాన్‌ సాహాలకు చోటు లభించింది. గాయాల భారిన పడ్డ రాహుల్‌ ద్రావిడ్‌, యువరాజ్‌ సింగ్‌లకు విశ్రాంతినిచ్చింది. శ్రీశాంత్‌ స్థానంలో కర్నాటక ఫాస్ట్‌ బౌలర్‌ అభిమన్యు, దిరేష్‌కార్తిక్‌ స్థానంలో బెంగాల్‌ వికెట్‌ కీపర్‌ వర్థమాన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.జట్టు వివరాలు : ఎంఎస్‌ ధోని ( కెప్టెన్‌), వీరేంధ్ర సెహ్వాగ్‌, గౌతం గంభీర్‌, సచిన్‌ టెండూల్కర్‌, ఎస్‌ భద్రీనాథ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, అమిత్‌ మిశ్రా, ప్రజ్ఞాన్‌ ఓజా, ఇషాంత్‌ శర్మ, ఎం విజయ్‌, సుధీప్‌ త్యాగి, అభిమన్యు మిథున్‌, వర్థమాన్‌ సాహా.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...