ధ్వంసం చేసిన వారినుంచే పరిహారం వసూలు : హైకోర్ట్
హైదరాబాద్,జనవరి 22: ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే వారి చేతే నష్టపరిహారాన్ని వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు అవసరమైతే చట్టాలను సవరించాలని సూచించింది. బంద్లు, ధర్నాలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు లేదని హైకోర్టు తెలిపింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ఆందోళన చేసుకోవచ్చని సూచించింది. వార్తల ప్రసారంలో మీడియా తన సామాజిక బాధ్యత గుర్తెరగాలని హైకోర్టు హితవు పలికింది.
Comments