ఫుల్ టైం గవర్నర్ భాధ్యతలు చేపట్టిన నరసింహన్


హైదరాబాద్,జనవరి 22: ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి గవర్నర్ గా ఇఎన్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనిల్ రమేష్ దవే ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 9.45 గంటలకు రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నారాయణ్ దత్ తివారి అనారోగ్య కారణాలతో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో జనవరి ప్రారంభంలో నరసింహన్ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయననే రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించడంతో మరోసారి శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు