Saturday, February 11, 2023

ఇప్పుడైనా సొంత జాగా ఇళ్లకు పైసలూడిపడేనా..

హైదరాబాద్,   ఫిబ్రవరి 11: రాష్ట్రంలో సొంత స్థలాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం 2023-24లో 4 లక్షల మంది వరకు లబ్ధిదారులకు సాయం అందించనుంది. ఈమేరకు పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి ఆర్థికసాయం అందించడానికి నిర్ణయించింది. అయితే రెండో సారి అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇదిగో అదిగో అంటున్న కె సి ఆర్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఎన్నికల దృష్ట్యా ఈ హడావిడి చేస్తోంది తప్ప పైసలూడి పడ తాయనుకోడం లేదని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...