Saturday, February 11, 2023

పాతబస్తీకీ మెట్రో తెస్తాం: కె టి ఆర్

హైదరాబాద్,   ఫిబ్రవరి 11: హైదరాబాద్ పాతబస్తీకి కచ్చితంగా మెట్రో తీసుకొస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  హామీ ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆయన శాసనసభా ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో నూతన మార్గాల ఏర్పాటుకు కేంద్రం సహకరించడం లేదని , బిజెపి అధికారం లో ఉన్న చోట చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో ఏర్పాటుకు కోట్ల నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహా నగరానికి మాత్రం కేంద్రం మొండి చెయ్యి చూపుతోందని ఆయన విమర్శించారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం-ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా హైదరాబాద్ నగరం నలుమూలల మురుగునీటి వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...