Sunday, February 12, 2023

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ను నియమించారు ఆంధ్రప్రదేశ్​కు కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్​ను నియమించారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్​గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్​, సిక్కిం గవర్నర్​గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్​గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​గా శివ్ ప్రతాప్​లను నియమించారు. లద్దాఖ్ ఎల్​జీగా. అరుణాచల్​ ప్రదేశ్ గవర్నర్​గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను నియమించారు. మణిపుర్ గవర్నర్​గా ఉన్న లా గణేశన్​ను నాగాలాండ్ గవర్నర్​గా బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్​ను మేఘాలయా గవర్నర్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిమాచల్ గవర్నర్​గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్​ను.. బిహార్ గవర్నర్​గా బదిలీ చేశారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...