న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.మహారాష్ట్ర కొత్త గవర్నర్గా రమేశ్ బైస్ను నియమించారు ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను నియమించారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్లో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా శివ్ ప్రతాప్లను నియమించారు. లద్దాఖ్ ఎల్జీగా. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను నియమించారు. మణిపుర్ గవర్నర్గా ఉన్న లా గణేశన్ను నాగాలాండ్ గవర్నర్గా బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ను మేఘాలయా గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిమాచల్ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను.. బిహార్ గవర్నర్గా బదిలీ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment