Thursday, October 27, 2022

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు..

హైదరాబాద్, అక్టోబర్ 26: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాంహౌస్ లో టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ఘటన పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. చట్టంలోని సెక్షన్ -8, సెక్షన్ -120బీ కింద మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఏ1గా దిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ2గా హైదరాబాద్ కు చెందిన నందకిశోర్ , ఏ3గా తిరుపతికి చెందిన సింహయాజులును చేర్చారు. నిందితుల నుంచి వివరాలను సేకరించిన తర్వాత ముగ్గురిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...