కాసరగోడ్: మొసళ్లు ఎక్కువగా మాంసాహారాన్నే ఇష్టపడుతాయి. నీటి ఒడ్డున మాటువేసి అటుగా వచ్చిన జంతువులపై దాడి చేస్తాయి. కానీ కేరళ లో కాసరగోడ్లోని అనంతపుర ఆలయ సరస్సులో ఉండే మొసలి మాత్రం మాంసం ముట్టదు. పూర్తిగా శాఖాహారి. సరస్సులోగల అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు పెట్టే బెల్లం, బియ్యం లాంటి ప్రసాదాలు మాత్రమే తింటుంది.1945 లో కాసరగోడ్లోని అనంతపుర సరస్సులో ఈ మొసలి కనిపించింది. ఆలయానికి వచ్చే భక్తులు ఎవరికీ ఇంతవరకు ఎలాంటి కీడు చేయలేదు. ఆలయ నిర్వాహకులు దానికి బబియా అని నామకరణం చేసి బాగోగులు చూసుకున్నారు. బబియా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులు పెట్టే ప్రసాదం తినేది. సరస్సులో ఆలయం చుట్టూ తిరిగేది. అప్పుడప్పుడు మెట్లపైకి వచ్చి సేదదీరేది. ఇలా భక్తులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారిపోయింది. అలాంటి బబియా పాపం ఆదివారం సరస్సులోనే ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్యం పాలైన బబియాకు వైద్యులు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. ఆలయ నిర్వాహకులు బబియాకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించదం విశేషం. .
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment