Tuesday, October 11, 2022

మూడవ వన్ డే లో భారత్ ఘనవిజయం: సిరీస్ కైవసం

న్యూఢిల్లీ, అక్టోబర్ 11; దక్షిణాఫ్రికాతో మూడు వన్ డే మ్యాచ్ ల సీరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది. ఢిల్లీ లో ఈ రోజు జరిగిన మూడవ, చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో భారత్​ ఘన విజయం సాధించింది. మొదట టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. 27.1 ఓవర్లలో 99 పరుగులకే సఫారీలను ఆల్​ ఔట్​ చేసింది. కుల్​దీప్ యాదవ్​ నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్​ సుందర్​, మహ్మద్ సిరాజ్​, షహబాజ్​ అహ్మద్ రెండు చొప్పున వికెట్లు తీశారు. సఫారీ జట్టులో క్లాసెన్​, మలాన్, యాన్​సెన్ మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు. తరువాత భారత్​ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. శుభ్​మన్​ గిల్ 49 పరుగులతో రాణించాడు. ఓపెనర్ ధావన్ 14 బంతుల్లో 8 పరుగులు , ఇషన్​ కిషన్​ 18 బంతుల్లో 10 పరుగులు 

చేశారు. శ్రేయస్​ అయ్యర్​ 28 పరుగులు చేశాడు. సంజు శాంసన్ రెండు పరుగులు చేశాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...