న్యూఢిల్లీ, అక్టోబర్ 11; దక్షిణాఫ్రికాతో మూడు వన్ డే మ్యాచ్ ల సీరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది. ఢిల్లీ లో ఈ రోజు జరిగిన మూడవ, చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. 27.1 ఓవర్లలో 99 పరుగులకే సఫారీలను ఆల్ ఔట్ చేసింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, షహబాజ్ అహ్మద్ రెండు చొప్పున వికెట్లు తీశారు. సఫారీ జట్టులో క్లాసెన్, మలాన్, యాన్సెన్ మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. తరువాత భారత్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 49 పరుగులతో రాణించాడు. ఓపెనర్ ధావన్ 14 బంతుల్లో 8 పరుగులు , ఇషన్ కిషన్ 18 బంతుల్లో 10 పరుగులు
చేశారు. శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేశాడు. సంజు శాంసన్ రెండు పరుగులు చేశాడు.
No comments:
Post a Comment