Tuesday, October 18, 2022

ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. కందుల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.500 పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోధుమలపై రూ.110 పెంచగా.. ఆవాలపై రూ.400 పెంచామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పంటలకు కనీస మద్దతు ధరను పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.


పంట

పెంపు

ధర(క్వింటాలుకు)


గోధుమలు

రూ.110

రూ.2,125

ఆవాలు

రూ.400   

రూ.5,450

బార్లీ

రూ.100   

రూ.1,735

శనగలు

రూ.105   

రూ.5,335

కందులు

రూ.500   

రూ.6,000

సన్​ఫ్లవర్

రూ.209   

రూ.5,650



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...