Thursday, January 28, 2016

తొలి జాబితాలో తెలంగాణకు దక్కని స్మార్ట్ సిటీ ... ఆంధ్ర నుంచి విశాఖ, కాకినాడ

న్యూఢిల్లీ,జనవరి 28; కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు గురువారం స్మార్ట్‌ సిటీల జాబితాను ప్రకటించారు. తొలి దశలో 20 స్మార్ట్‌ సిటీలను ఆయన ప్రకటించారు. ఇందులో తెలంగాణకు స్థానం దక్కలేదు.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖ, కాకినాడ ఎంపిక అయ్యాయి. స్మార్ట్‌ సిటీలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు వెంకయ్య  వెల్లడించారు. స్మార్ట్‌సిటీల ఎంపికలో పారదర్శకత పాటించామని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్‌ సిటీలతో నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.  ఇవే స్మార్ట్‌ సిటీలు : న్యూఢిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చి, పుణె, జైపూర్‌, ‌జబల్‌పూర్, దావణగేరి, సూరత్, అహ్మదాబాద్‌, షోలాపూర్‌, లూధియానా, భోపాల్‌, భువనేశ్వర్, గువహటి, బెల్గాం, ఇండోర్, ఉధంపూర్‌, విశాఖ, కాకినాడ.  


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...