విజయవాడ, డి సెంబరు 9: ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా దూరప్రాంత రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కేంద్రంగా రైల్వే వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై ఫీజిబిలిటీ రిపోర్టు ఇవ్వాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ)ను ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో అమరావతి జనాభా 2 లక్షలకు మించనున్న నేపథ్యంలో రాజధానికి సులభంగా వచ్చిపోయే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం రైల్వే వ్యవస్థపై అధ్యయనం చేస్తోంది. రాజధానికి రావాలన్నా, వెళ్లాలన్నా.. అటు గుంటూరు రైల్వే స్టేషనకు కానీ, ఇటు విజయవాడ రైల్వే స్టేషనకు వెళ్ళాల్సి వుంటుంది. ఇది కొంత అసౌకర్యంగా ఉంది. అమరావతిలోనే రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేస్తే నేరుగా రాజధానికి చేరుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. విజయవాడ వయా తాడేపల్లి, మంగళగిరిల మీదుగా రాజధానికి కనెక్టివిటీ లైన్ కు సంబంధించి కూడా ఎలా చేస్తే బాగుంటుందో నివేదిక కోరింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment