న్యూఢిల్లీ, నవంబర్ 6: ఇకపై రైలు టిక్కెట్ రద్దు చాలా భారమే. క్యాన్సిలేషన్ ఛార్జీలు రెండింతలు కానున్నాయి. రైల్వే శాఖ ఈ నెల 12 నుంచి కొత్త క్యాన్సిలేషన్ ఛార్జీలు అమలు చేయనుంది. ప్రయాణానికి 48 గంటలకు ముందు టిక్కెట్ రద్దు చేసుకుంటే ఇకపై డబుల్ క్యాన్సిలేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ తరగతికి రూ.240, ఏసీ టూ టైర్కు రూ.200, ఏసీ త్రిటైర్కు రూ.180, స్లీపర్ క్లాస్కు రూ.120, సెకెండ్ క్లాస్ టిక్కెట్పై రూ.60 మేర రద్దు ఛార్జీలు వసూలు చేస్తారు. వెయిట్ లిస్ట్, ఆర్ఏసీ టిక్కెట్లను ట్రైన్ షెడ్యూల్కు అరగంట ముందుగానే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. రైలు వెళ్ళిన తర్వాత ఇకపై ఎలాంటి టిక్కెట్లైనా క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. స్టేషన్ మాస్టారుకు కూడా టిక్కెట్ క్యాన్సిల్ అధికారం కల్పించనున్నారు. కౌంటర్లో రిఫండ్ ఇవ్వని పక్షంలో ఆయనను సంప్రదించవచ్చు. అయితే రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ కాకముందు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment