Thursday, April 9, 2015

సత్యం రాజు సహా దోషులందరికీ ఏడేళ్ళ జైలు ....

హైదరాబాద్‌, ఏప్రిల్ 9; సత్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామలింగరాజుతో పాటు దోషులందరికీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రామలింగరాజు, రామరాజులకు రూ. 5 కోట్లు చొప్పున జరిమానా విధించింది. మిగతా దోషులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించింది. రామలింగరాజు సహా దోషులందరినీ జైలుకు తరలిస్తున్నారు. 
 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది.* 2009 జనవరి 9న సీఐడీ కేసు నమోదు, రామలింగరాజు అరెస్ట్‌* నిందితులుగా రామరాజు, సూర్యనారాయణరాజు, వడ్లమాని శ్రీనివాస్‌, ఆడిటర్లు గోపాలకృష్ణన్‌, తాళ్లూరి శ్రీనివాస్‌, మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలం, అంతర్గత ఆడిటర్‌ ప్రభాకర్‌ గుప్తాలపై ఐపీసీ 120బీ, 420, 409, 419, 467, 471, 477ఏ, 201 సెక్షన్ల కింద కేసు నమోదు * 2009 ఫిబ్రవరి 16న సీబీఐ రంగప్రవేశం * ప్రత్యేక కోర్టు ఏర్పాటు, న్యాయమూర్తిగా బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి నియామకం* 3 అభియోగపత్రాలను కలిపి ప్రత్యేక న్యాయస్థానం విచారణ .* 2011 నవంబరు 4న రామలింగరాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు .* మదుపుదారుల నష్టంతో కలిపి కుంభకోణం విలువ రూ.14వేల కోట్లుగా లెక్క తేల్చిన సి.బి.ఐ. * కుంభకోణంలో రామలింగరాజు, ఇతర నిందితులు కలిసి రూ.2743కోట్లు అక్రమంగా సంపాదించినట్లు సీబీఐ నిర్ధారణ .* ఈ కేసులో 226 మందిని విచారించిన కోర్ట్ ...3115 దస్త్రాలను పరిశీలన.... 




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...