Thursday, April 16, 2015

అమెరికా రోడ్డు ప్రమాదం లో ప్రకాశం విద్యార్ధి దుర్మరణం

న్యూయార్క్ , ఏప్రిల్‌ 16 : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి శైలేంద్రహర్ష మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శైలేంద్ర అమెరికాలోని లామార్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. శైలేంద్ర తండ్రి పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. శైలేంద్ర నడుపుతున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శైలేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  మరో నాలుగు రోజుల్లో శైలేంద్ర మృతదేహం ఒంగోలుకు వచ్చే అవకాశం ఉంది. ప్రమాదంలో శైలేంద్రతో పాటు మరో విద్యార్థి దీపక్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. దీపక్‌ స్వస్థలం పామూరుగా తెలుస్తోంది.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...