Wednesday, April 8, 2015

బంపర్ లాటరీఫై బాబు సర్కార్ ఆశ .?

విజయవాడ ,ఏప్రిల్ 8; నిధుల కొరతను తీర్చుకునే చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  అనేక మార్గాలను ,అవకాశాలను పరిశీలీస్తోంది .. ఇందులో భాగంగా గతంలో ఉన్న భాగ్యలక్ష్మీ బంపర్ లాటరీ టికెట్లను ప్రవేశ పెట్టడంపై బాబు సర్కార్ ద్రష్టి  పెట్టినట్టు సమాచారం . గతంలో నడిచిన ఈ లాటరీ ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో నిలిచిపోయింది .అయితే  ఇప్పుడు కొత్త రాష్ట్రం కావడంతో ఆదాయం  చాలా అవసరం. రుణమాఫీ, రాజధాని నిర్మాణం వంటి విషయాలకు పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఇందుకోసం లాటరీ ని కూడా ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు  ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలలో లాటరీలు నడుస్తున్నాయి. కాగా,  చట్ట సవరణ  ద్వారా మాత్రమే  తిరిగి లాటరీ తేవలసి వుంటుంది .

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...