Tuesday, April 7, 2015

అమెరికాలో గుంటూరు యువకుని హత్య ...

గుంటూరు, ఏప్రిల్ 7:  గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడిని అమెరికాలో కొందరు దుండగులు హత్య చేశారు. తుళ్లూరు మండలం, దొండపాడుకు చెందిన రాజేష్ అనే యువకుడు వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడ్డాడు. అమెరికాలో డబ్బు కోసం కొందరు దుండగులు రాజేష్‌ను కాల్చిచంపినట్లు తెలిసింది. నల్లజాతీయుఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం..ఇలినాయి రాష్ట్రంలోని పియోరియా ప్రదేశంలో ఓ గ్యాస్‌కంపెనీలో రాజేష్‌ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొంతమంది నల్లజాతీయులు గ్యాస్‌ కంపెనీ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్‌ చేయగా రాజేష్‌ అందుకు నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాజేష్‌పై నల్లజాతీయులు కాల్పులు జరిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...