Tuesday, April 7, 2015

వికారుద్దిన్ సామాన్యుడు కాదు...

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 07 : వరంగల్‌ జిల్లా ఆలేరు వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వికారుద్దీన్‌ దోడిపీల ద్వారా డబ్బు సంపాదించే వాడు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయి. 2008లో తొలిసారిగా వికారుద్దీన్‌ పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. మక్కామసీదులో బాంబు పేలుడుకు నిరసనగా ప్రతిఏటా దాడులకు దిగుతానని ప్రకటించి పోలీసులకు సవాలు విసిరాడు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసులను కాల్చి చంపాడు. గతంలో గుజరాత్‌ హోంమంత్రిపై దాడి కేసులో వికారుద్దీన్‌ నిందితుడు. అంతేకాదు గతంలో నరేంద్రమోదీని కూడా చంపేందుకు యత్నించాడు. ఐఎస్‌ఐతో సంబంధాలున్న వికారుద్దీన్‌ భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. వికారుద్దీన్‌ ముఠా డీజేఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసింది. ఇంతటి కరుడుగట్టిన ఉగ్రవాదిని పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వికారుద్దీన్‌ను ఇటీవల విశాఖపట్నం జైలు నుంచి వరంగల్‌కు తరలించారు. ఈ ఉదయం పోలీసు వాహనంలో వికారుద్దీన్‌ సహా వికార్‌ అహ్మద్‌, సయ్యద్‌ అంజాద్‌ అలియాస్‌ సులేమాన్‌, ఇజార్‌ఖాన్‌, మహ్మద్‌ అనీఫ్‌, మహ్మద్‌ జకీర్‌లను హైదరాబాద్‌ తరలిస్తుండగా మూత్రం కోసం వాహనం ఆపి పోలీసులపై దాడికి దిగారు. పోలీసుల వద్దనున్న ఆయుధాన్ని తీసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పుల్లో వీరిని మట్టుబెట్టారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...