Tuesday, April 21, 2015

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి పట్నాయక్‌ మృతి



తిరుపతి, ఏప్రిల్‌ 21: అసోం మాజీ గవర్నర్‌, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జాకీ బల్లభ పట్నాయక్‌(88) కన్నుమూశారు. మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో గుండెపోటుకు గురైన పట్నాయక్‌ తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తిరుపతిలోని రాష్ర్టీయ సంస్కృత వర్సిటీ 18వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన సోమవారం రాత్రి సంస్కృత విద్యాపీఠంలో బస చేశారు.

1927 జనవరి 3న పూరి జిల్లాలోని రామేశ్వర్‌లో జన్మించిన జేబీ పట్నాయక్‌ 1947లో ఉత్కల్‌ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 1949లో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జేబీ 1980-89, 1995-99 మధ్య కాలంలో ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో అస్సాం గవర్నర్‌గా చేశారు.పట్నాయక్ భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు తరలించారు.  



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...